ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-10-26T08:39:23+05:30 IST
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున 93.5శాతం మంది విద్యార్థులు
- 30,063 మంది గైర్హాజరు
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున 93.5శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. కరోనా విపత్తు వల్ల గతంలో రద్దయిన ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలను సోమవారం నుంచి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొదటి రోజున.. సెకండ్ లాంగ్వేజి పేపర్-1 పరీక్షను 4,29,177 మంది విద్యార్థులు రాశారు. 30,063 మంది గైర్హాజరయ్యారు.