హెచ్సీఏలో వివాదాలపై బీసీసీఐ సీరియస్గా ఉంది: అజారుద్దీన్
ABN , First Publish Date - 2021-04-11T20:45:22+05:30 IST
హైదరాబాద్లో క్రికెట్ అభివృద్ధికి 20% ఫండ్ కేటాయించామని హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ తెలిపారు.
హైదరాబాద్: హైదరాబాద్లో క్రికెట్ అభివృద్ధికి 20 శాతం ఫండ్ కేటాయించామని హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాలో గ్రౌండ్లు ఏర్పాటు చేస్తామన్నారు. పలువురు తమ స్వలాభం కోసం, తానేమి చేస్తున్నా అడ్డుపడాలని చూస్తున్నారని ఆక్షేపించారు. హెచ్సీఏలో వివాదాలపై బీసీసీఐ సీరియస్గా ఉందని తెలిపారు. ఏజీఎంలో వివాదం సృష్టించిన వారికి షోకాజ్ నోటీస్లు ఇవ్వడంతో పాటు అవసరమైతే సస్పెండ్ చేస్తామని అజారుద్దీన్ ప్రకటించారు.
కొద్దిసేపటి క్రితం హెచ్సీఏ వార్షిక సర్వసభ్య సమావేశం ముగిసింది. సమావేశంలో అపెక్స్ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంబుడ్స్మెన్గా జస్టిస్ దీపక్వర్మను నియామించారు. అంబుడ్స్మెన్ నియామకంపై స్టేజీపైనే అజారుద్దీన్, విజయనంద్ మధ్య వివాదం చోటుచేసుకుంది.