నేడు బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2021-07-25T05:13:00+05:30 IST

నేడు బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష

నేడు బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష


వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, జూలై 24: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల కళాశాలల్లో అడ్మిషన్ల కోసం ఆదివారం ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రాంతీయ సమన్వయకులు వై.మనోహర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాల్లో  ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు కొవిడ్‌ నిబంధనల మేరకు మాస్కు ధరించి తగిన జాగ్రత్తలతో పరీక్ష కేంద్రాలకు పరీక్ష సమయానికి గంట మందుగానే చేరుకోవాలని కోరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 జూనియర్‌ కళాశాలల్లో 1,280 సీట్లు ఉండగా 5,153 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. అలాగే, 589 మంది విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు, జనగామ జిల్లాలో 4, జయశంకర్‌ భూపాలపల్లిలో 6, మహబూబాబాద్‌ జిల్లాలో 7, ములుగు జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మనోహర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-07-25T05:13:00+05:30 IST