Barkatpura: నేటినుంచి పక్షవాతానికి ఉచిత చికిత్స శిబిరం
ABN , First Publish Date - 2021-10-20T12:52:16+05:30 IST
శ్యామ్ మందిర్ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 27వతేదీ వరకు పక్షవాతానికి ఆధునిక పరికరాలతో ఉచిత చికిత్సా శిబిరం నిర్వహిస్తున్నట్లు హ్యుమానిటీ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ కొండా
హైదరాబాద్/బర్కత్పుర: శ్యామ్ మందిర్ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 27వతేదీ వరకు పక్షవాతానికి ఆధునిక పరికరాలతో ఉచిత చికిత్సా శిబిరం నిర్వహిస్తున్నట్లు హ్యుమానిటీ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ కొండా శ్రీనివా్సరావు తెలిపారు. కాచిగూడ రైల్వే స్టేషన్ ఎదురుగా గల శ్యాంబాబా మందిర్ ఆవరణలో ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలనుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ చికిత్స కొనసాగుతుందన్నారు. పూర్తి వివరాలకు 9949238492 ఫోన్ నెంబర్లో సంప్రదించాలని సూచించారు.