Banjarahills‌: తండ్రి అంత్యక్రియలు.. మరునాడే కొడుకు కన్నుమూత

ABN , First Publish Date - 2021-12-26T15:54:41+05:30 IST

అనారోగ్యంతో కన్నుమూసిన తండ్రికి అంత్యక్రియలు చేసిన మరుసటి రోజే కుమారుడు కన్నుమూసిన విషాద ఘటన ఇది. బంజారాహిల్స్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలిలా

Banjarahills‌: తండ్రి అంత్యక్రియలు.. మరునాడే కొడుకు కన్నుమూత

హైదరాబాద్/బంజారాహిల్స్‌: అనారోగ్యంతో కన్నుమూసిన తండ్రికి అంత్యక్రియలు చేసిన మరుసటి రోజే కుమారుడు కన్నుమూసిన విషాద ఘటన ఇది. బంజారాహిల్స్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన డి.హరూన్‌ రషీద్‌ కుటుంబంతో ముంబైలో స్థిరపడ్డాడు. శేషజీవితం నగరంలో గడపాలని నాలుగు నెలల క్రితం ఒక్కడే ఇక్కడకు వచ్చాడు. బంజారాహిల్స్‌ సయ్యద్‌నగర్‌లో అఫ్జల్‌ అనేవ్యక్తి వద్ద పేయింగ్‌ గెస్టుగా ఉంటున్నాడు. వారం రోజుల క్రితం రషీద్‌కు జ్వరం రావడంతో ఇంటి యజమాని అఫ్జల్‌ ముంబైలో ఉన్న అతని కుమారుడు అబ్దుల్‌సలాంకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఈనెల 22న సలాం నగరానికి వచ్చాడు.  23న తండ్రి రషీద్‌ మరణించడంతో సలాం కుంగిపోయాడు. అదేరోజు తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఇంటికి వచ్చాక కూడా తండ్రి గురించే ఆలోచిస్తూ గడిపాడు. 24వతేదీ తెల్లవారు జామున సలాంను ఎంత పిలిచినా లేవలేదు. అతన్ని పరీక్షించగా నిద్రలోనే మరణించినట్టు తేలింది. అఫ్జల్‌ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. ముంబై నుంచి అబ్దుల్‌ సలాం కుటుంబీకులు వచ్చి మృతదేహాన్ని తీసుకొని  వెళ్లిపోయారు.

Updated Date - 2021-12-26T15:54:41+05:30 IST