జస్ట్ డ్రైవ్ ఇన్ ఫుడ్ కోర్టులో మున్సిపల్ అధికారుల దాడులు
ABN , First Publish Date - 2021-11-09T17:50:48+05:30 IST
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేటర్ పరిధిలోని జస్ట్ డ్రైవ్ ఇన్ ఫుడ్ కోర్టులో మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు.
![జస్ట్ డ్రైవ్ ఇన్ ఫుడ్ కోర్టులో మున్సిపల్ అధికారుల దాడులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
రంగారెడ్డి : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేటర్ పరిధిలోని జస్ట్ డ్రైవ్ ఇన్ ఫుడ్ కోర్టులో మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. హోటల్ నిర్వాహకులు కుళ్ళిపోయిన మాంసాహారంతో ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. అనుమానం వచ్చి ఓ కస్టమర్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టారు.