అనేక ఆలయాల్లో దూప దీప నైవేధ్యాలు జరగడం లేదు: బండి సంజయ్

ABN , First Publish Date - 2021-11-05T17:48:13+05:30 IST

ఇప్పటికీ అనేక ఆలయాల్లో దూప దీప నైవేధ్యాలు జరగడం లేదని బండి సంజయ్ అన్నారు.

అనేక ఆలయాల్లో దూప దీప నైవేధ్యాలు జరగడం లేదు: బండి సంజయ్

హైదరాబాద్: ఇప్పటికీ అనేక ఆలయాల్లో దూప దీప నైవేధ్యాలు జరగడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం ఆయన విద్యానగర్ శంకర్‌మఠాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ కేదార్నాథ్ వరద బీభత్సంలో ఆదిశంకరాచార్యుల విగ్రహం కొట్టుకుపోయిందని, తిరిగి ప్రధాని మోదీ విగ్రాహాన్ని పునఃప్రతిష్టించి.. పూజా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. గతంలో తాను హిందూ అని చెప్పుకునే పరిస్థితులు లేవన్నారు. మోదీయే లేకుంటే ఈ పవిత్ర కార్యం జరిగేదా? అని అన్నారు. అయోధ్య రామ మందిరం, 370 ఆర్టికల్ రద్దు జరిగేదా?...దీన్ని కూడా మత కోణంలో చూడడం మూర్ఖత్వమన్నారు. 80 శాతం హిందువులు ఉన్న దేశంలో ధర్మం కోసం పని చేస్తే మతతత్వం అనడం దుర్మార్గమని బండి సంజయ్ అన్నారు.

Updated Date - 2021-11-05T17:48:13+05:30 IST