మరో 79వేల మంది ప్రైవేటు టీచర్లకు సాయం

ABN , First Publish Date - 2021-05-20T08:39:11+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆపత్కాల సాయం కింద మరో 79వేల మంది ప్రైవేటు పాఠశాలల్లోని సిబ్బంది లబ్ధి పొందారు.

మరో 79వేల మంది ప్రైవేటు టీచర్లకు సాయం

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆపత్కాల సాయం కింద మరో 79వేల మంది ప్రైవేటు పాఠశాలల్లోని సిబ్బంది లబ్ధి పొందారు. విద్యాసంస్థలు మూసివేయడంతో తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న బోధన, బోధనేతర సిబ్బందికి నెలకు రూ.2 వేల ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యం అందించాలని గతంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-05-20T08:39:11+05:30 IST