అసైన్డ్ భూములపై విచారణ జరిపించాలి
ABN , First Publish Date - 2021-05-05T08:41:31+05:30 IST
అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని తెలంగాణ వ్యవసాయ సంఘం అధ్యక్షుడు కె.కాంతయ్య, ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వరరావు అన్నా రు.

రాష్ట్ర వ్యవసాయ సంఘం డిమాండ్
హైదరాబాద్, మే 4 (ఆంధ్రజ్యోతి): అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని తెలంగాణ వ్యవసాయ సంఘం అధ్యక్షుడు కె.కాంతయ్య, ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వరరావు అన్నా రు. రాజకీయాలకు అతీతంగా, పక్షపాతం లేకుండా ఈ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసైన్మెంట్, అటవీ, భూదాన, దేవు డి మాన్యం, వక్ఫ్, పోడు, ప్రభుత్వ భూములను సుమారు 26 లక్షల ఎకరాల ను ప్రభుత్వం పంపిణీ చేసిందని వ్యాఖ్యానించారు.