రేపు వరంగల్‌ ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటీస్‌ మేళా

ABN , First Publish Date - 2021-03-24T06:07:27+05:30 IST

రేపు వరంగల్‌ ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటీస్‌ మేళా

రేపు వరంగల్‌ ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటీస్‌ మేళా

కాకతీయకాలనీ, మార్చి 23 : హైదరాబాద్‌కు చెందిన తొషిబా బహుళజాతి సంస్థ ఈనెల 25న ములుగురోడ్డులోని వరంగల్‌ ప్రభుత్వ బాలుర ఐటీఐలో అంప్రెంటీస్‌ మేళా ని ర్వహించనున్నారని ప్రిన్సిపాల్‌ జుమ్లా నాయక్‌ మంగళవా రం ఒక ప్రకటనలో తెలిపారు. 18-26 సంవత్సరాల వయస్సు కలిగి ఐటీఐలో ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌ ట్రేడ్‌ పూర్తి చేసిన బాలురు మాత్రమే అర్హులన్నారు. మేళాకు బయోడేటా, ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్టు ఫొటోలు, ఎస్సెస్సీ, ఐటీఐ సర్టిఫికెట్లు వెంట తీసుకురావాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.11వేలు స్టైఫండ్‌ చెల్లిస్తారన్నారు. 

Updated Date - 2021-03-24T06:07:27+05:30 IST