శ్రీవారి సేవలో ఏపీ, తెలంగాణ న్యాయమూర్తులు

ABN , First Publish Date - 2021-12-26T08:34:38+05:30 IST

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గంగారావు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ బూయన్‌ శనివారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో ఏపీ, తెలంగాణ న్యాయమూర్తులు

తిరుమల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గంగారావు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ బూయన్‌ శనివారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన వీరు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వదించగా, అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు. అలాగే ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళణిస్వామి, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

Updated Date - 2021-12-26T08:34:38+05:30 IST