వచ్చే 1 నుంచి ఎంసెట్ బైపీసీ కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2021-11-28T09:19:22+05:30 IST
రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరానికి గాను బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ, ఫార్మాసూటికల్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ బైపీసీ విద్యార్థులకు వచ్చే నెల 1 నుంచి తొలి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.

హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరానికి గాను బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ, ఫార్మాసూటికల్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ బైపీసీ విద్యార్థులకు వచ్చే నెల 1 నుంచి తొలి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ శనివారం ఒక ప్రకటనలో ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. వచ్చే నెల 1 నుంచి 3 వరకు ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఆన్లైన్లోనే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని, సహాయ కేంద్రాలకు వెళ్లేందుకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. 3, 4 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని, 5వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశముంటుందని తెలిపారు. 7న తొలివిడత కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు.