అఖిలప్రియకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
ABN , First Publish Date - 2021-01-14T21:08:35+05:30 IST
మాజీ మంత్రి అఖిలప్రియకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఆమెను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపర్చారు. కోర్టు సెలవు కారణంగా ...
హైదరాబాద్: మాజీ మంత్రి అఖిలప్రియకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఆమెను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపర్చారు. కోర్టు సెలవు కారణంగా న్యాయమూర్తి నివాసంలో అఖిలప్రియను హాజరుపర్చారు. 3 రోజుల విచారణ స్టేట్మెంట్ను న్యాయమూర్తికి పోలీసులు అందజేశారు. దీంతో అఖిలప్రియకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు. బెయిల్ ఇవ్వాలని అఖిలప్రియ తరపు న్యాయవాదులు కోరారు.
కాగా కస్టడీలో భాగంగా బేగంపేట మహిళా పీఎస్లో 3 రోజులు అఖిలప్రియను పోలీసులు ప్రశ్నించారు. అనంతరం ఆమెకు బేగంపేట్ పాటిగడ్డ హెల్త్ కేర్ సెంటర్లో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు నెగెటివ్గా తేలింది. అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈసీజీ, చెస్ట్ ఎక్స్రే, గైనకాలజి డిపార్ట్మెంట్లో పరీక్షలు నిర్వహించారు. న్యూరాలజీ వైద్యులు పరీక్షలు జరిపారు.