ఆ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-05-19T09:25:23+05:30 IST
రాష్ట్రంలో ముందస్తు ఫీజులు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ముందస్తు ఫీజు వసూలుచేస్తున్నారని ఏబీవీపీ ఆరోపణ
హైదరాబాద్, మే 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ముందస్తు ఫీజులు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.