ఎమ్మెల్యేలతో బహిరంగ క్షమాపణ చెప్పించాలి
ABN , First Publish Date - 2021-11-23T09:01:59+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిపై వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అసభ్యకరంగా, అవమానకరంగా మాట్లాడడం నిజమే అయితే, ఆ విధంగా మాట్లాడిన వారి చేత వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.
![ఎమ్మెల్యేలతో బహిరంగ క్షమాపణ చెప్పించాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఏపీ సీఎం జగన్కు మందకృష్ణ డిమాండ్
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిపై వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అసభ్యకరంగా, అవమానకరంగా మాట్లాడడం నిజమే అయితే, ఆ విధంగా మాట్లాడిన వారి చేత వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.. ఏపీ సీఎం జగన్ను డిమాండ్ చేశారు. ఆ విధంగా క్షమాపణలు చెప్పించగలిగితే అవమానానికి గురైన భువనేశ్వరికి కొంతలో కొంతైనా స్వాంతన చేకూరుతుందని, ఆ కుటుంబం మానసిక వేదన నుంచి కొంతమేరకు బయటపడుతుందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.