ఎకరాకు 30 వేల పరిహారమివ్వాలి: కిసాన్ కాంగ్రెస్
ABN , First Publish Date - 2021-07-25T08:45:35+05:30 IST
రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల పంటలకు తీవ్రంగా నష్టం జరిగిందని, రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు...
హైదరాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల పంటలకు తీవ్రంగా నష్టం జరిగిందని, రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీభవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30వేల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.