1500 కోట్లు అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
ABN , First Publish Date - 2021-12-08T09:17:03+05:30 IST
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం నిర్వహించిన ఇ-ఆక్షన్లో సెక్యూరిటీ బాండ్లను కుదువపెట్టి రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు అప్పు తీసుకుంది.
![1500 కోట్లు అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం నిర్వహించిన ఇ-ఆక్షన్లో సెక్యూరిటీ బాండ్లను కుదువపెట్టి రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు అప్పు తీసుకుంది. 6.86 శాతం వార్షిక వడ్డీపై 24 ఏళ్లకు ఈ సెక్యూరిటీ బాండ్లను ప్రభుత్వం తనఖా పెట్టింది. అప్పు తీసుకున్న ఆరు రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వ రుణంపైనే ఎక్కువ వడ్డీ పడింది.