కౌశిక్రెడ్డికి 10 లక్షల ఫైన్
ABN , First Publish Date - 2021-07-22T07:31:23+05:30 IST
పాడి కౌశిక్రెడ్డి టీఆర్ఎ్సలో చేరిన సందర్భంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో
హైదరాబాద్ సిటీ: పాడి కౌశిక్రెడ్డి టీఆర్ఎ్సలో చేరిన సందర్భంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడంపై జీహెచ్ఎంసీ కొరడా ఝుళిపించింది. కాంగ్రెస్ నేతలు, పలువురు పౌరులు ట్విటర్లో ఫొటోలతో సహా చేసిన పోస్ట్ల ఆధారంగా రూ.10లక్షలకుపైగా జరిమానా విధించింది. ఇదిలా ఉండగా.. కౌశిక్రెడ్డి చేరిక సందర్భంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోని ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వందలాది కార్లతో ఆయన ర్యాలీగా రావడంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనికితోడు వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.