సోషల్ మీడియాకు యువీ భార్య గుడ్‌బై!

ABN , First Publish Date - 2021-03-05T03:10:48+05:30 IST

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ భార్య, బాలీవుడ్ నటి హాజెల్ కీచ్ తన సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేశారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్‌స్టాగ్రాం ద్వారా..

సోషల్ మీడియాకు యువీ భార్య గుడ్‌బై!

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ భార్య, బాలీవుడ్ నటి హాజెల్ కీచ్ తన సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేశారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్‌స్టాగ్రాం ద్వారా వెల్లడించారు. తాను సోషల్ మీడియా నుంచి కొంత కాలం విరామం తీసుకోబోతున్నట్లు ఆ పోస్ట్ ద్వారా తెలిపారు. ‘నేను, నా ఫోన్ కొన్నాళ్లు పాటు బ్రేక్ తీసుకోబోతున్నాం. నాకు తెలుసు.. నా నిర్ణయం మీలో చాలామందికి ఆశ్చర్యం కలిగించి ఉండవచ్చు. కానీ తప్పదు. కొన్నిసార్లు ఇలాంటి ఎడబాటు తప్పదు. ఒకరిపై మరొకరు పూర్తిగా ఆధారపడకుండా ఎవరికివారుగా జీవించడం ఎలానో తెలుసుకునేందుకు ఇలాంటి పరిస్థితులు ఉపయోగపడతాయి. 


అందుకే నేను కొంతకాలం సోషల్ మీడియాకు దూరం కాబోతున్నాను. ఈ టెక్నాలజీ ప్రపంచం నుంచి నిజమైన ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాను. నాకు శుభాకాంక్షలు చెప్పంది. నా నెంబరు ఉన్నవారు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. మెసేజ్‌లు వద్దు. నేను మళ్లీ తిరిగి వస్తాను. కానీ ఇప్పుడప్పుడే కాదు’ అంటూ హెజెల్ కీచ్ తన ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చారు.



Updated Date - 2021-03-05T03:10:48+05:30 IST