టీటీ ప్రీక్వార్టర్స్లో భారత జోడీలు
ABN , First Publish Date - 2021-11-27T08:54:36+05:30 IST
వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షి్ప మిక్స్డ్ డబుల్స్లో రెండు భారత జోడీలు ప్రీక్వార్టర్స్ చేరాయి. మనికా బాత్రా-సాథియన్ జోడీ 3-1తో డియాజ్-అఫానడోర్ (ప్యూర్టోరికో)పై
హూస్టన్: వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షి్ప మిక్స్డ్ డబుల్స్లో రెండు భారత జోడీలు ప్రీక్వార్టర్స్ చేరాయి. మనికా బాత్రా-సాథియన్ జోడీ 3-1తో డియాజ్-అఫానడోర్ (ప్యూర్టోరికో)పై నెగ్గగా శరత్ కమల్-అర్చన కామత్ ద్వయం 3-2తో అస్సార్-డీనా(ఈజిప్టు)పై గెలిచి ప్రీక్వార్టర్స్లో ప్రవేశించింది. మహిళల డబుల్స్లో మనికా-అర్చన జోడీ 3-0తో డిగ్రా్ఫ-మార్చిట్టి (బెల్జియం)పై నెగ్గి ప్రీక్వార్టర్స్ చేరింది. ఇక, పురుషుల సింగిల్స్ సాథియన్ రెండో రౌండ్లో ఓటమి పాలవగా, పురుషుల డబుల్స్లో శరత్-సాథియన్ ద్వయం కూడా పరాజయం చవిచూసింది.