అచ్చం విరాట్ కోహ్లీలాగే..
ABN , First Publish Date - 2021-03-05T21:24:37+05:30 IST
భారత్-ఇంగ్లండ్ మధ్య జరగుతున్న టెస్ట్ సిరీస్లో నిర్ణయాత్మక నాలుగో టెస్టు మొతేరా స్టేడియంలో జరుగుతున్న విషయం తెలిసిందే.
అహ్మదాబాద్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరగుతున్న టెస్ట్ సిరీస్లో నిర్ణయాత్మక నాలుగో టెస్టు మొతేరా స్టేడియంలో జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి రోజు ఆటలో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి.. మ్యాచ్పై పట్టు సాధించారు. భారత జట్టు అభిమానులు సంబరాల్లో మునిగిపోగా.. స్టేడియంలో మరో అద్భుతం చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలా ఉన్న ఓ వ్యక్తి స్టేడియంలో సందడి చేశాడు. అచ్చం కోహ్లీని తలపించిన అతడిని చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. క్యాప్ నుంచి షూ వరకు... ఆహార్యంలోనూ కోహ్లీని తలపిస్తూ అతడి చేసిన సందడి నెట్టింట హల్ చల్ చేస్తోంది. పలువురు నెటిజన్లు ఆ ఫొటోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.