అథ్లెట్ల ‘తొలి’ బృందం టోక్యో పయనం
ABN , First Publish Date - 2021-07-18T08:47:17+05:30 IST
ఒలింపిక్స్కు ఎంపికైన భారత అథ్లెట్లలో తొలి విడత బృందం శనివారం టోక్యో పయనమైంది.
ఆల్ ది బెస్ట్..
న్యూఢిల్లీ: ఒలింపిక్స్కు ఎంపికైన భారత అథ్లెట్లలో తొలి విడత బృందం శనివారం టోక్యో పయనమైంది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నిషిత్ ప్రామాణిక్, ్జకేంద్ర క్రీడాప్రాథికార సంస్థ (సాయ్) డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్, ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా, సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతాతో పాటు ఐఓఏ అధికారులంతా కలిసి అథ్లెట్లకు ఇక్కడ జరిగిన కార్యక్రమంలో గ్రాండ్గా సెండాఫ్ ఇచ్చారు.
‘135 కోట్ల మంది భారతీయులు మీ వెంట ఉన్నారు.. గొప్ప ప్రదర్శనతో విజయాలతో రండి’ అని మంత్రి అనురాగ్ ఠాకూర్ అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్చరీ, బ్యాడ్మింటన్, టీటీ, హాకీ, జూడో, జిమ్నాస్టిక్స్, వెయిట్లిఫ్టింగ్, స్విమ్మింగ్ క్రీడాంశాల నుంచి 54 మంది అథ్లెట్లతో కలిపి మొత్తం 88 మందితో కూడిన బృందం టోక్యో బయలుదేరింది. మరో రెండ్రోజుల్లో మిగతా అథ్లెట్లు టోక్యో వెళ్లనున్నారు. భారత్ నుంచి ఈసారి 119 మంది అథ్లెట్లు ఒలింపిక్స్లో పోటీపడుతున్నారు.