ట్రాక్ అండ్ ఫీల్డ్ తొలి స్వర్ణం ఇథియోపియాది
ABN , First Publish Date - 2021-07-31T08:48:05+05:30 IST
ఇథియోపియాకు చెందిన సెలెమాన్ బరేగా టోక్యో ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ తొలి పసిడి పతకం అందుకున్న ఘనత సాధించాడు.
టోక్యో: ఇథియోపియాకు చెందిన సెలెమాన్ బరేగా టోక్యో ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ తొలి పసిడి పతకం అందుకున్న ఘనత సాధించాడు. 10 వేల మీటర్ల పరుగులో 27ని43.22సె.లో గమ్యం చేరిన సెలెమాన్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈనేపథ్యంలో.. ప్రపంచ చాంపియన్, ప్రపంచ రికార్డు హోల్డర్ జోషువా చెప్టెగె (ఉగాండా)ను వెనక్కునెట్టాడు. చెప్టెగె 27ని43.63సె.తో రజతానికే పరిమితమయ్యాడు. మరో ఉగాండా అథ్లెట్ జాకబ్ కిప్లిమో(27ని43.88సె) కాంస్య పతకం నెగ్గాడు.