ఫైనల్ రౌండ్కు శ్రీజ
ABN , First Publish Date - 2021-03-03T09:37:13+05:30 IST
తెలుగమ్మాయి ఆకుల శ్రీజ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్లో మహిళల సింగిల్స్ మెయిన్ డ్రాకు అడుగుదూరంలో నిలిచింది. దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ క్వాలిఫయర్స్లో...
దోహా: తెలుగమ్మాయి ఆకుల శ్రీజ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్లో మహిళల సింగిల్స్ మెయిన్ డ్రాకు అడుగుదూరంలో నిలిచింది. దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ క్వాలిఫయర్స్లో స్టార్ క్రీడాకారిణి మనికా బాత్రాతో పాటు శ్రీజ ఫైనల్ రౌండ్కు దూసుకెళ్లింది. ప్రపంచ 150వ ర్యాంకరైన శ్రీజ గతరౌండ్లలో వరుసగా 87వ ర్యాంకర్ ఒరవాన్ పరనాంగ్ (థాయ్లాండ్), 74వ ర్యాంకర్ వెగా పౌలీనా (చిలీ)పై గెలుపొంది తుదిపోరులో నిలిచింది. ఫైనల్ రౌండ్లో రష్యాకు చెందిన మరియా తైలకోవాతో శ్రీజ అమీతుమీ తేల్చుకోనుంది. ఇదే విభాగంలో ఫైనల్ చేరిన మనిక మెయిన్ డ్రాలో చోటు కోసం గన్నా గపొనోవా (ఉక్రెయిన్)తో తలపడనుంది.