ఇది కరోనా టెస్టా?.. రక్తం కారుతున్న ఫొటోలు షేర్ చేసిన తెలుగు ప్లేయర్!

ABN , First Publish Date - 2021-01-13T03:36:44+05:30 IST

థాయ్‌లాండ్ ఓపెన్ కోసం ఆ దేశానికి వెళ్లిన బాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్.. ఇక్కడి వైద్య అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడు. వారి పనితీరును తప్పుబడుతున్నాడు. దీనికి ఓ బలమైన కారణం ఉంది.

ఇది కరోనా టెస్టా?.. రక్తం కారుతున్న ఫొటోలు షేర్ చేసిన తెలుగు ప్లేయర్!

బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ కోసం ఆ దేశానికి వెళ్లిన బాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్.. ఇక్కడి వైద్య అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడు. వారి పనితీరును తప్పుబడుతున్నాడు. దీనికి ఓ బలమైన కారణం ఉంది. అదేంటంటే.. థాయ్ ఓపెన్‌లో పాల్గొనే క్రీడాకారులు అందరికీ కరోనా టెస్టులు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్‌కు కూడా టెస్టులు చేశారు. దీని కోసం అతని మ్యూకస్ సేకరించే సమయంలో వైద్యులు సరిగ్గా జాగ్రత్తలు పాటించలేదు. దీంతో శ్రీకాంత్ ముక్కులో నుంచి రక్తం ధారలుగా కారింది. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసిన శ్రీకాంత్.. ‘మేం కోర్టులో ఆడటం కోసం సిద్ధం అవుతాం. అంతేగానీ ఇలా రక్తం చిందించడం కోసం కాదు. ఇక్కడకు వచ్చాక నాలుగు సార్లు కరోనా టెస్టులు చేయించుకున్నా. వాటిలో ఏ ఒక్కసారీ మంచి అనుభవం లేదు’ అని శ్రీకాంత్ ట్వీట్ చేశాడు. దీన్ని చూసిన చాలా మంది నెటిజన్లు థాయ్‌లాండ్ వైద్య అధికారుల పనితీరును తప్పుబడుతున్నారు.

Updated Date - 2021-01-13T03:36:44+05:30 IST