రెండో టీ20లో లంక గెలుపు

ABN , First Publish Date - 2021-03-06T05:30:00+05:30 IST

వెస్టిండీస్‌తో రెండో టీ20లో శ్రీలంక 43 పరుగుల తేడాతో నెగ్గింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. తొలుత శ్రీలంక 20 ఓవర్లలో 160/6 స్కోరు చేసింది. ఓపెనర్లు గుణతిలక (56), నిసాంక (37) రాణించారు.

రెండో టీ20లో లంక గెలుపు

కూలిడ్జ్‌ (ఆంటిగ్వా) : వెస్టిండీస్‌తో రెండో టీ20లో శ్రీలంక 43 పరుగుల తేడాతో నెగ్గింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. తొలుత శ్రీలంక 20 ఓవర్లలో 160/6 స్కోరు చేసింది. ఓపెనర్లు గుణతిలక (56), నిసాంక (37) రాణించారు. డ్వేన్‌ బ్రావో (2/25) రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో శ్రీలంక స్పిన్నర్ల దెబ్బకు వెస్టిండీస్‌ 18.4 ఓవర్లలో 117  పరుగులకే ఆలౌటైంది. మెక్‌ కాయ్‌ (23) టాప్‌ స్కోరర్‌. సందకన్‌ (3/10), హసరంగ డిసిల్వా (3/17) మూడేసి వికెట్లు సాధించారు.

Updated Date - 2021-03-06T05:30:00+05:30 IST