Tokyo Olympics: పతకానికి అడుగు దూరంలో భారత బాక్సర్

ABN , First Publish Date - 2021-07-29T15:48:31+05:30 IST

విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ సతీష్ కుమార్ గురువారం జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో జమైకన్ బాక్సర్‌ను కంగుతినిపించాడు.

Tokyo Olympics: పతకానికి అడుగు దూరంలో భారత బాక్సర్

టోక్యో: విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ సతీష్ కుమార్ గురువారం జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో జమైకన్ బాక్సర్‌ను కంగుతినిపించాడు. పురుషుల సూపర్ హేవీవెయిట్ 91 కేజీల విభాగంలో జమైకా బాక్సర్ రికార్డో బ్రౌన్‌పై సతీష్ 4-1 తేడాతో విజయం సాధించాడు. దీంతో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్‌లో ఆదివారం ఉజ్బెకిస్థాన్ బాక్సర్ బఖోదీర్ జలొలొవ్‌తో తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సెమీస్‌కు వెళ్తే సతీష్‌కు పతకం ఖాయం అవుతుంది. సెమీస్‌లో ఓడిన కాంస్యం ఖాయం. కనుక ఆయన ఇప్పుడు పతకానికి కేవలం అడుగు దూరంలోనే ఉన్నాడు. 


Updated Date - 2021-07-29T15:48:31+05:30 IST