తొలి పోరులో ముంబై - చెన్నై
ABN , First Publish Date - 2021-07-26T09:01:33+05:30 IST
ఐపీఎల్-2 షెడ్యూల్ను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. సెప్టెంబరు 19న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్తో దుబాయ్లో జరిగే బ్లాక్బస్టర్ పోరుతో టోర్నీ
ఐపీఎల్-2 షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: ఐపీఎల్-2 షెడ్యూల్ను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. సెప్టెంబరు 19న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్తో దుబాయ్లో జరిగే బ్లాక్బస్టర్ పోరుతో టోర్నీ పునఃప్రారంభం కానుంది. మార్చిలో భారత్లో మొదలైన లీగ్లో కొవిడ్ కేసులు బయటపడడంతో మేలో సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక..యూఏఈలో నిర్వహించే టోర్నీలో మొత్తం 31 మ్యాచ్లు జరగనున్నాయి. అక్టోబరు 15 వరకు 27 రోజుల వ్యవధిలో నిర్వహించే ఐపీఎల్-2లో ఏడు డబుల్ హెడర్ మ్యాచ్లున్నాయి. పగటి మ్యాచ్లు మధ్యాహ్నం 3.30కి, రాత్రి మ్యాచ్లు 7.30కి ప్రారంభమవుతాయి. అక్టోబరు 8న లీగ్ మ్యాచ్లు ముగుస్తాయి. అక్టోబరు 10న క్వాలిఫయర్-1 (దుబాయ్), 11న ఎలిమినేటర్, 13న క్వాలిఫయర్-2 (షార్జా) జరుగుతాయి. 15న ఫైనల్కు దుబాయ్ ఆతిథ్యమిస్తుంది. రెండో దశ ప్రారంభ మ్యాచ్లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు.