ప్రొఫెషనల్ బాక్సింగులోకి ఒలింపిక్ పతక విజేత లవ్లీనా
ABN , First Publish Date - 2021-11-27T01:00:45+05:30 IST
ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహెయిన్ తన మనసులో మాటను వెల్లడించింది. ప్రొఫెషనల్

గువాహటి: ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహెయిన్ తన మనసులో మాటను వెల్లడించింది. ప్రొఫెషనల్ బాక్సింగ్లోకి వెళ్లబోతున్నట్టు చెప్పింది. నిజానికి ప్రొఫెషనల్ బాక్సింగ్ తన కల అని పేర్కొన్న లవ్లీనా.. భారత్లో ప్రొఫెషనల్ బాక్సింగును ఎంచుకున్న వారు పెద్దగా లేరని పేర్కొంది.
కాబట్టి ఈ రంగంలో తన ముద్ర వేయాలని భావిస్తున్నట్టు తెలిపింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణం గెలవాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. ‘స్పోర్ట్స్ స్టార్’ నార్త్ ఈస్ట్ స్పోర్ట్స్ కాంక్లేవ్కు హాజరైన లవ్లీనా ఈ వ్యాఖ్యలు చేసింది.
ఒలింపిక్స్లో పతకం గెలిచిన మూడో భారత బాక్సర్గా లవ్లీనా రికార్డు సృష్టించింది. అంతకుముందు విజేందర్ సింగ్ 2008 బీజింగ్ ఒలింపిక్స్లో, 2012 లండన్ ఒలింపిక్స్లో మేరీ కోమ్ ఈ ఘనత సాధించారు.
అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల లవ్లీనా తొలుత కిక్బాక్సర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. టోక్యో ఒలింపిక్స్లో తాను పతకం సాధించిన తర్వాత తన స్వగ్రామంలోని పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చినట్టు తెలిపింది.