వయసు పెరిగినట్లు అనిపిస్తోంది.. రికార్డు సాధించడంపై ధోనీ!
ABN , First Publish Date - 2021-04-18T10:49:07+05:30 IST
కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.. తాజాగా ఐపీఎల్లో ఒక ఫ్రాంచైజీకి అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్కు సారధిగా ఉన్న ధోనీ..
చెన్నై: కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.. తాజాగా ఐపీఎల్లో ఒక ఫ్రాంచైజీకి అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్కు సారధిగా ఉన్న ధోనీ.. తాజాగా ఆ జట్టు తరఫున 200వ మ్యాచ్ ఆడాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన ఈ మ్యాచులో చెన్నై జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ‘‘2008లో ఈ ప్రయాణం మొదలైంది. సౌతాఫ్రికాలో ఆడాం. దుబాయికి వెళ్లాం. ఇప్పుడు మళ్లీ స్వదేశానికి వచ్చాం. ముంబై మా హోం గ్రౌండ్ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు’’ అని ధోనీ వెల్లడించాడు. అలాగే 200 మ్యాచులు ఆడిన రికార్డు గురించి మాట్లాడుతూ.. ఈ రికార్డు వల్ల వయసు పెరిగిన భావన కలుగుతోందని, ఇది చాలా సుదీర్ఘ ప్రయాణమని తెలిపాడు.