నీరజ్, బజరంగ్లకు లవ్లీ యూనివర్సిటీ నగదు పురస్కారం
ABN , First Publish Date - 2021-08-10T00:24:31+05:30 IST
చండీగఢ్: టోక్యో ఒలింపిక్స్లో భారత్కు పతకాలు అందించిన నీరజ్ చోప్రాకు, బజ్రంగ్ పునియాలకు వాళ్లు చదువుకుంటోన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నగదు పురస్కారాలు ప్రకటించింది.
చండీగఢ్: టోక్యో ఒలింపిక్స్లో భారత్కు పతకాలు అందించిన నీరజ్ చోప్రాకు, బజ్రంగ్ పునియాలకు వాళ్లు చదువుకుంటోన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నగదు పురస్కారాలు ప్రకటించింది. నీరజ్కు 50 లక్షల రూపాయలు, బజ్రంగ్కు 10 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఈ యూనివర్సిటీలో నీరజ్ బీఏ చదువుకుంటుండగా, బజ్రంగ్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నాడు. వీరిద్దరూ తమ యూనివర్సిటీకి గర్వకారణమంటూ క్యాష్ ప్రైజ్లను ప్రకటించింది. జావెలిన్ త్రోలో నీరజ్ స్వర్ణం సాధించగా, బజ్రంగ్ రెజ్లింగ్లో కాంస్యం సాధించాడు.