తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్
ABN , First Publish Date - 2021-04-18T23:18:28+05:30 IST
కోల్కతా నైట్ రైడర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ తొలి ఓవర్ నుంచే ధాటిగా ఆడడం..
చెన్నై: కోల్కతా నైట్ రైడర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ తొలి ఓవర్ నుంచే ధాటిగా ఆడడం ప్రారంభించింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో కైల్ జేమిసన్ బౌలింగ్లో కేకేఆర్ ఓపెనర్ శుభ్మన్ గిల్ వరుస బౌండరీలతో రెచ్చిపోయాడు. ఓ ఫోర్, రెండు సిక్స్లతో విరుచుకుపడ్డాడు. అయితే ఈ తర్వాతి బంతికే లాంగాన్ మీదుగా బౌండరీ బాదేందుకు ప్రయత్నించాడు. అయితే థర్టీ యార్డ్ సర్కిల్ లోపల ఉన్న డేనియల్ క్రిస్టియన్ ఎడమ వైపుకు సూపర్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. దీంతో కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 1.5 ఓవర్లలో 23 పరుగులు చేసింది. నితీశ్ రాణా(2), రాహుల్ త్రిపాఠి(0) క్రీజులో ఉన్నారు.