Kanpur Test: Lunch Break భారత్ స్కోర్ 339/8

ABN , First Publish Date - 2021-11-26T17:29:33+05:30 IST

టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆటను 258/4తో ప్రారంభించిన టీమిండియా జట్టు మరో 81 పరుగులు చేసి నాలుగు వికెట్లను కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి 8 వికెట్ల నష్టానికి 339

Kanpur Test: Lunch Break భారత్ స్కోర్ 339/8

కాన్పూర్ టెస్ట్: టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆటను 258/4తో ప్రారంభించిన టీమిండియా జట్టు మరో 81 పరుగులు చేసి నాలుగు వికెట్లను కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి 8 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. అశ్విన్ 54 బంతుల్లో 5 ఫోర్లతో 38 రన్స్ చేయగా, ఉమేష్ యాదవ్ 28 బంతుల్లో 4 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నారు. అంతకుముందు శ్రేయస్ అయ్యర్ (171 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 105) పరుగులు చేసి ఔటయ్యాడు. కివీస్ బౌల్లర్లలో సౌథీ 5, జేమిసన్ 3 వికెట్లు దక్కాయి.

Updated Date - 2021-11-26T17:29:33+05:30 IST