ప్రపంచకప్ కోర్ గ్రూప్లో జ్యోతి సురేఖ
ABN , First Publish Date - 2021-02-01T06:46:42+05:30 IST
తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖకు ఆర్చరీ ప్రపంచకప్ కోర్గ్రూప్లో చోటు లభించింది. మేలో జరగనున్న వరల్డ్కప్ కోసం ఆదివారం న్యూఢిల్లీలోని యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్లో భారత ఆర్చరీ సంఘం ట్రయల్స్...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖకు ఆర్చరీ ప్రపంచకప్ కోర్గ్రూప్లో చోటు లభించింది. మేలో జరగనున్న వరల్డ్కప్ కోసం ఆదివారం న్యూఢిల్లీలోని యమున స్పోర్ట్స్ కాంప్లెక్స్లో భారత ఆర్చరీ సంఘం ట్రయల్స్ నిర్వహించింది. ఈ ట్రయల్స్లో 32 మంది పురుషులు, 38 మంది మహిళా ఆర్చర్లు పోటీపడ్డారు. వీరిలో నుంచి 24 మందిని ప్రాబబుల్స్కు ఎంపిక చేశారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సురేఖ 2767/2880 స్కోరుతో టాప్-12లో అగ్రస్థానంలో నిలిచి శభాష్ అనిపించింది. సురేఖ ప్రస్తుతం పెట్రోలియం స్పోర్ట్స్ బోర్డ్కు ప్రాతినిథ్యం వహిస్తోంది.