జడేజా జిమ్ వీడియో వైరల్!
ABN , First Publish Date - 2021-05-13T15:42:14+05:30 IST
ఐపీఎల్ అర్ధంతరంగా రద్దుకావడంతో టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఐపీఎల్ అర్ధంతరంగా రద్దుకావడంతో టీమిండియా ఆటగాళ్లు ఇటీవల ఇళ్లకు చేరుకున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. జూన్ 18-22 మధ్య ఇంగ్లండ్లోని సౌతాంప్టన్లో న్యూజిలాండ్తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడనున్నారు. అనంతరం ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్నారు.
ఈ పర్యటన కోసం భారత్ ఆటగాళ్లు ప్రస్తుతం సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన ఆల్ రౌండర్ జడేజా కూడా ఇంగ్లండ్ టూర్కు సిద్ధమవుతున్నాడు. ఇంట్లో ఏర్పాటు చేసుకున్న సొంత జిమ్లో కసరత్తులు చేస్తున్నాడు. తన జిమ్కు సంబంధించిన వీడియోను, ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గంట వ్యవధిలోనే లక్ష లైకులు సొంతం చేసుకున్నాయి.