దీప్తి, సుష్మపై ఆశలు
ABN , First Publish Date - 2021-03-14T06:08:20+05:30 IST
ఐదు వన్డేల సిరీస్లో వెనకబడిన భారత మహిళలు విజయమే లక్ష్యంగా నాలుగో మ్యాచ్లో బరిలోకి దిగుతున్నారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో ఈ మ్యాచ్ జరగనుంది...
![దీప్తి, సుష్మపై ఆశలు](https://media.andhrajyothy.com/appimg/galleries/202103141231437/03142021003724n76.jpg)
- దక్షిణాఫ్రికాతో భారత మహిళల నాలుగో వన్డే నేడు
- ఉ.9 గం.నుంచి స్టార్స్పోర్ట్స్ 2 లో..
లఖ్నవ్: ఐదు వన్డేల సిరీస్లో వెనకబడిన భారత మహిళలు విజయమే లక్ష్యంగా నాలుగో మ్యాచ్లో బరిలోకి దిగుతున్నారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో ఈ మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో చిత్తయిన మిథాలీసేన రెండో మ్యాచ్లో అద్భుతంగా పుంజుకొని గెలుపొందింది. తద్వారా 1-1తో సిరీ్సను సమం చేసింది. కానీ మూడో వన్డేలో ఆ జోరు కొనసాగించ లేకపోయింది. దాంతో దక్షిణాఫ్రికా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ముఖ్యంగా చివరి 10 ఓవర్లలో ఽభారత్ ధాటిని కనబరచలేకపోతోంది. ఇందుకు జట్టులో పవర్ హిట్టర్లు లేకపోవడం కారణం. ఈ నేపథ్యంలో ఆల్రౌండర్ దీప్తి శర్మ, వికెట్ కీపర్, బ్యాటర్ సుష్మా వర్మపై భారత్ భారీగా ఆశలుపెట్టుకుంది. పూనమ్ రౌత్, స్మృతి, మిథాలీ, హర్మన్ప్రీత్ టాప్, మిడిల్డార్లో సత్తా చాటాలి. చివర్లో దీప్తి, సుష్మ వారికి తోడైతే భారత్కు విజయం కష్టం కాబోదు.