క్రికెట్కు చోటుంటే.. ఒలింపిక్స్లో భారత జట్లు
ABN , First Publish Date - 2021-04-17T09:07:08+05:30 IST
భారత మహిళల క్రికెట్ జట్టు 2022 (బర్మింగ్హామ్) కామన్వెల్త్ క్రీడల్లో ఆడనుంది. అంతేకాదు..
కామన్వెల్త్ గేమ్స్లో ఆడనున్న మహిళల బృందం
బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లో నిర్ణయం
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు 2022 (బర్మింగ్హామ్) కామన్వెల్త్ క్రీడల్లో ఆడనుంది. అంతేకాదు.. 2028లో లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు కల్పిస్తే, భారత పురుషులు, మహిళల జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ వర్చువల్ సమావేశంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇక.. మిథాలీ రాజ్, హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళల జట్లు ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనున్నాయని బీసీసీఐ అధికారి తెలిపారు.