భారత్కు మరో గుడ్న్యూస్.. ఇక రజతం పక్కా..!
ABN , First Publish Date - 2021-08-04T21:31:38+05:30 IST
పీవీ సింధు కాంస్య పతకంతో పులకించిపోతున్న భారత క్రీడాభిమానులకు మరో గుడ్ న్యూస్!
టోక్యో: పీవీ సింధు కాంస్య పతకంతో పులకించిపోతున్న భారత క్రీడాభిమానులకు మరో గుడ్ న్యూస్! టోక్యో ఒలింపిక్స్లో పోటీ పడుతున్న భారత రెజ్లర్ రవి కుమార్ దహియా(23) తాజాగా ఫైనల్స్లో అడుగు పెట్టి భారత్కు కనీసం రజత పతకాన్ని ఖాయం చేశాడు. పురుషుల 57కేజీల కేటగిరీలో బరిలోకి దిగిన దహియా సెమీఫైనల్స్లో కజికిస్థాన్కు చెందిన నురిస్లామ్ సానాయేవ్పై అనూహ్య విజయం సాధించాడు. విజయం ప్రత్యర్థిదే అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా పుంజుకుని, విక్టరీ బై ఫాల్ పద్ధతిలో రవి నురిస్లామ్ను ఒడించి ఫైనల్స్లోకి అడుగుపెట్టాడు. దీంతో.. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు రజతం ఖాయమైపోయింది. రవి ఇదే స్పీడును కొనసాగిస్తే స్వర్ణపతకం కూడా భారత్ వశమవుతుంది.