నాలుగో టెస్ట్: లంచ్ సమయానికి టీమిండియా స్కోరు ఎంతంటే..

ABN , First Publish Date - 2021-01-19T13:22:30+05:30 IST

ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. పుజారా, గిల్ క్రీజులో పాతుకుపోయి ఆడుతున్నారు. 4/0తో ఐదో రోజు మ్యాచ్ ఆరంభించిన టీమిండియాకు...

నాలుగో టెస్ట్: లంచ్ సమయానికి టీమిండియా స్కోరు ఎంతంటే..

బ్రిస్బేన్: ఆస్ట్రేలియా-భారత్ మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. పుజారా, గిల్ క్రీజులో పాతుకుపోయి ఆడుతున్నారు. 4/0తో ఐదో రోజు మ్యాచ్ ఆరంభించిన టీమిండియాకు ప్రారంభంలోనే భారీ దెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ మళ్లీ నిరాశపరుస్తూ కేవలం 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. కానీ మరో ఓపెనర్ గిల్(64) మాత్రం పుజారా(8)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపిస్తున్నారు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లకు పరీక్ష పెడుతున్నారు. ఈ క్రమంలోనే లంచ్ సమయానికి భారత్ ఒక్క వికెట్ నష్టానికి 83 పరుగుల చేసింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్‌కు ఓ వికెట్ దక్కింది. మ్యాచ్‌లో గెలవాలంటే భారత్ ఇంకా 245 పరుగులు చేయాల్సి ఉంది. 

Updated Date - 2021-01-19T13:22:30+05:30 IST