కష్టాల్లో టీమిండియా.. 186 పరుగులకే 6 వికెట్లు
ABN , First Publish Date - 2021-01-17T14:30:56+05:30 IST
టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-టీమిండియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో
బ్రిస్బేన్: టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-టీమిండియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్ తీవ్రంగా విఫలమయ్యారు. 62/2 పరుగుల దగ్గర మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ(44) మినహా మరో బ్యాట్స్మెన్ ఎవరూ కనీసం 40 పరుగులు కూడా చేయకపోవడం గమనార్హం. శుభ్మన్ గిల్(7), చతేశ్వర్ పుజారా(25), ఆజింక్య రహానే(37), మయాంక్ అగర్వాల్(38), రిషబ్ పంత్(23) పరుగులు తీవ్రంగా నిరాశపరిచారు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్(12), శార్దూల్ ఠాకూర్(12) క్రీజులో ఉన్నారు. టీమిండియా ప్రస్తుత స్కోర్ 205 పరుగులు కాగా, ఇప్పటికి 164 పరుగులు వెనకబడి ఉంది.