England vs India: నిలకడగా ఆడుతున్న భారత్

ABN , First Publish Date - 2021-08-28T00:58:28+05:30 IST

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు నిలకడగా ఆడుతోంది. రూట్ సేన

England vs India: నిలకడగా ఆడుతున్న భారత్

లీడ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు నిలకడగా ఆడుతోంది. రూట్ సేన 432 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 34 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (8) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి రోహిత్ శర్మ నిదానంగా ఆడుతూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. ఇద్దరూ కలిసి 95 బంతుల్లో 45 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  ప్రస్తుతం భారత జట్టు వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. రోహిత్‌శర్మ 40, చతేశ్వర్ పుజారా 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ కంటే భారత జట్టు ఇంకా 275 పరుగులు వెనుకబడి ఉంది.

Updated Date - 2021-08-28T00:58:28+05:30 IST