South Africa vs India: టీ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు ఎంతంటే?
ABN , First Publish Date - 2021-12-26T23:58:23+05:30 IST
దక్షిణాఫ్రికాతో ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్లో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు టీ బ్రేక్ సమయానికి రెండు వికెట్ల..
![South Africa vs India: టీ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు ఎంతంటే?](https://media.andhrajyothy.com/appimg/galleries/1921122606221889/12262021182644n87.jpg)
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్లో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు టీ బ్రేక్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 68, కెప్టెన్ విరాట్ కోహ్లీ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు రాహుల్, మయాంక్ అగర్వాల్ జోడీ శుభారంభాన్ని ఇచ్చింది.
ఇద్దరూ కలిసి తొలి వికెట్కు 117 పరుగులు జోడించారు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని జోరుమీదున్నట్టు కనిపించిన మయాంక్.. 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లుంగి ఎంగిడి బౌలింగులో ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. రాహుల్తో కలిసి సంయమనంతో ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగులు పెంచుకుంటూ పోతున్నాడు.