రాథోడ్‌కు స్వర్ణం.. దీప్తికి రజతం

ABN , First Publish Date - 2021-03-01T09:45:59+05:30 IST

సౌత్‌జోన్‌ జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారుల పతక జోరు కొనసాగుతోంది.

రాథోడ్‌కు స్వర్ణం.. దీప్తికి రజతం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): సౌత్‌జోన్‌ జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారుల పతక జోరు కొనసాగుతోంది. కేరళలోని కోజికోడ్‌లో ఆదివారం జరిగిన అండర్‌-16 బాలుర 300 మీటర్ల రేసులో రాథోడ్‌ సెహ్వాగ్‌ 35.75 సెకన్లలో లక్ష్యాన్ని అధిగమించి స్వర్ణం సాధించాడు. అండర్‌-18 బాలికల 200 మీటర్లలో దీప్తి 24.68 సెకన్లలో రేసు ముగించి రెండోస్థానంతో రజత పతకం అందుకుంది. 

Updated Date - 2021-03-01T09:45:59+05:30 IST