వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్ ఫైనల్‌ వీక్షణకు నాలుగువేల మందికి అనుమతి

ABN , First Publish Date - 2021-05-21T05:47:56+05:30 IST

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగే తొలి వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌కు రోజుకు నాలుగు వేలమంది వీక్షకులను అనుమతించనున్నారు.

వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్ ఫైనల్‌ వీక్షణకు నాలుగువేల మందికి అనుమతి

సౌతాంప్టన్‌: భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగే తొలి వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌కు రోజుకు నాలుగు వేలమంది వీక్షకులను అనుమతించనున్నారు. ఫైనల్‌ జరిగే రోజ్‌బౌల్‌ స్టేడియం సీటింగ్‌ కెపాసిటీ 25 వేలు. కరోనా మహమ్మారి కారణంగా ఖాళీ స్టేడియంలో టెస్ట్‌ చాంపియన్‌షి్‌పను నిర్వహిస్తారేమోనని భావించారు. అయితే, ఇంగ్లండ్‌లో పరిస్థితులు మెరుగుపడుతుండడంతో పరిమిత సంఖ్య        లో ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతిస్తున్నారు. 50 శాతం టికెట్లను ఐసీసీ తన స్పాన్సరర్ల కోసం తీసుకోనుంది. మిగిలిన రెండు వేల టికెట్ల కోసం భారీ డిమాండ్‌ నెలకొంది. జూన్‌ 18 నుంచి భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ జరగనుంది. 

Updated Date - 2021-05-21T05:47:56+05:30 IST