బీసీసీఐకి డబ్బుపైనే ఆసక్తి
ABN , First Publish Date - 2021-05-05T09:13:42+05:30 IST
ఐపీఎల్-14 మళ్లీ జరుగుతుందని తాను అనుకోవడం లేదని మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ అన్నాడు. బీసీసీఐకి డబ్బు మీద తప్ప ఆటగాళ్ల భద్రత
ఐపీఎల్-14 మళ్లీ జరుగుతుందని తాను అనుకోవడం లేదని మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ అన్నాడు. బీసీసీఐకి డబ్బు మీద తప్ప ఆటగాళ్ల భద్రత మీద ఆలోచన లేదని అన్నాడు. అసలు లీగ్ను మొత్తానికి రద్దు చేసినా నష్టమేమీలేదని అభిప్రాయపడ్డాడు. బయోబబుల్ను కట్టుదిట్టమైన భద్రతా వలయంలో నిర్వహిస్తే కేకేఆర్, సీఎస్కే, ఎస్ఆర్హెచ్, డీసీ క్రికెటర్లు, సహాయ సిబ్బందికి ఎందుకు కొవిడ్ సోకిందని ఆజాద్ బీసీసీఐని నిలదీశాడు.