దివ్యకు జీఎం హోదా
ABN , First Publish Date - 2021-10-14T09:12:16+05:30 IST
భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్యా దేశ్ ముఖ్ మహిళా గ్రాండ్ మాస్టర్ (డబ్ల్యూజీఎం) హోదా దక్కించుకొంది.
ముంబై: భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్యా దేశ్ ముఖ్ మహిళా గ్రాండ్ మాస్టర్ (డబ్ల్యూజీఎం) హోదా దక్కించుకొంది. తద్వారా భారత్ నుంచి ఈ ఘనత సాధించిన 21వ క్రీడాకారిణిగా నిలిచింది. ఇటీవల హంగేరిలోని బుడాపెస్ట్లో జరిగిన గ్రాండ్మాస్టర్ చెస్ టోర్నీలో నాగ్పూర్కు చెందిన 15 ఏళ్ల దివ్య రెండో ఐఎమ్ నార్మ్తో పాటు ఆఖరి, మూడో డబ్ల్యూజీఎం నార్మ్ సాధించింది.