టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ
ABN , First Publish Date - 2021-04-28T00:43:13+05:30 IST
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మరి కాసేపట్లో ప్రారంబం కానుంది. అహ్మదాబాద్ స్టేడియంలో ఈ రెండు జట్లూ మొదటి సారి పోరాడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం వికెట్ పొడిగా ..
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మరి కాసేపట్లో ప్రారంబం కానుంది. అహ్మదాబాద్ స్టేడియంలో ఈ రెండు జట్లూ మొదటి సారి పోరాడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం వికెట్ పొడిగా ఉందని, దానిని వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు ఢిల్లీ కెప్టెన్ పంత్ చెప్పాడు. అలాగే తమ జట్టులో రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఇశాంత్ శర్మను తీసుకున్నట్లు చెప్పాడు. ఇక ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ.. మ్యాచ్ పై మంచు ప్రభావం ఉంటుందని, అందువల్ల తాను టాస్ గెలిచి ఉన్నా ఫీల్డింగ్ ఎంచుకునేవాడినని అన్నాడు. అలాగే తమ జట్టులో రెండు మార్పులు చేసినట్లు చెప్పాడు. సైనీని తొలగించి రజత్ పాటిదార్ను తిరిగి జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు. అలాగే డ్యానియల్ శామ్స్ను క్రిస్టియర్ స్థానంలో తీసుకున్నట్లు చెప్పాడు.