సాయ్ భోపాల్లో కరోనా కలకలం
ABN , First Publish Date - 2021-04-08T05:57:42+05:30 IST
భారత క్రీడా ప్రాథికార సంస్థ (సాయ్) భోపాల్ కేంద్రాన్ని కరోనా చుట్టుముట్టింది. ఇక్కడి 24 మంది అథ్లెట్లు, 12 మంది సహాయ సిబ్బంది సహా మొత్తం 36 మంది కరోనా బారినపడ్డారు...
- 24 మంది అథ్లెట్లకు పాజిటివ్
న్యూఢిల్లీ: భారత క్రీడా ప్రాథికార సంస్థ (సాయ్) భోపాల్ కేంద్రాన్ని కరోనా చుట్టుముట్టింది. ఇక్కడి 24 మంది అథ్లెట్లు, 12 మంది సహాయ సిబ్బంది సహా మొత్తం 36 మంది కరోనా బారినపడ్డారు. అయితే అథ్లెట్లలో ఒలింపిక్స్కు సన్నద్ధమవుతున్న వారు ఎవరూ లేరని సాయ్ బుధవారం తెలిపింది. ఈనెల 3,6 తేదీల్లో నిర్వహించిన పరీక్షల్లో వీరంతా పాజిటివ్గా తేలినట్టు పేర్కొంది.