శుక్లాకు విరుద్ధ ప్రయోజనాల నోటీసులు
ABN , First Publish Date - 2021-01-16T06:43:36+05:30 IST
బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఎంపికైన ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లాకు విరుద్ధ ప్రయోజనాల సెగ తాకింది. శుక్లా బీసీసీఐలో ఆఫీస్ బేరర్గా ఉంటూ ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం డైరెక్టర్గా కొనసాగుతున్నాడంటూ సంజీవ్ గుప్తా బోర్డు ఎథిక్స్ ఆఫీసర్...
ముంబై: బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఎంపికైన ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లాకు విరుద్ధ ప్రయోజనాల సెగ తాకింది. శుక్లా బీసీసీఐలో ఆఫీస్ బేరర్గా ఉంటూ ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం డైరెక్టర్గా కొనసాగుతున్నాడంటూ సంజీవ్ గుప్తా బోర్డు ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్కు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై రెండువారాల్లోగా సమాధాన మివ్వాలంటూ శుక్లాకు జైన్ నోటీసులు పంపారు.