తొలి వికెట్ కోల్పోయిన చెన్నై

ABN , First Publish Date - 2021-04-22T02:10:14+05:30 IST

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అర్ధసెంచరీతో అదరగొట్టిన ఋతురాజ్ గైక్వాడ్..

తొలి వికెట్ కోల్పోయిన చెన్నై

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అర్ధసెంచరీతో అదరగొట్టిన ఋతురాజ్ గైక్వాడ్(64: 42 బంతుల్లో.. 6 ఫోర్లు, 4 సిక్సులు) ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఔట్ అయ్యాడు. కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వేసిన ఓ లెంగ్త్ బాల్ ను మిడ్ వికెట్ మీదుగా భారీ షాద్ ఆడబోయిన రుతురాజ్.. అక్కడ ఫ్యాట్ కమ్మిన్స్ చేతికి చిక్కాడు. దీంతో డు ప్లెసిస్(48: 34 బంతుల్లో.. 3 ఫోర్లు, 2 సిక్సులు) సెంచరీ భాగస్వామ్యాన్ని తెరపడింది. ప్రస్తుతం చెన్నై.. 12.2 ఓవర్లలో 115 పరుగులు ఓ వికెట్ కోల్పోయింది.

Updated Date - 2021-04-22T02:10:14+05:30 IST